-సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు
ప్రజాబలం చెన్నూరు నియోజకవర్గ రిపోర్టర్ డిసెంబర్ 13:
మంచిర్యాల జిల్లా మందమర్రి డివిజన్ పరిధిలోని ఏరియా వర్క్ షాప్ లో డివైస్ సి వెహికల్ పై కన్వియన్స్ డ్రైవర్ గా విధులు నిర్వహిస్తున్నా సంతోష్ అనే కాంటాక్ట్ కన్వెయన్స్ డ్రైవర్ ని అకారణంగా, ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా టెండర్ మారిందనే నేపంతో విధుల నుండి తీసివేయడం.తగదని సింగరేణి కాంట్రాక్టు కార్మిక సంఘం అధ్యక్షుడు దూలం శ్రీనివాస్ తీవ్రంగా అరోపించారు. గత ఆరు సంవత్సరాలుగా ఎంతో నమ్మకంతో, నిబద్ధతతో పనిచేస్తున్న కన్వేయన్స్ డ్రైవర్ని ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఎలా తొలగిస్తారని అధికారులను ప్రశ్నించారు. అధికారి వెహికల్ టెండర్ గడువు గత నెల 30తో ముగిసిందనీ కొత్త టెండర్ డిసెంబరు ఒకటి నుండి ప్రారంభం కాగా, నేనే ఈ వెహికిల్ ఓనర్ ని కాబట్టి నేనే నడుపుకుంటానంటూ ఆరు సంవత్సరాలుగా పనిచేస్తున్న సంతోష్ అనే డ్రైవర్ని నిర్ధాక్షణంగా విధులనుండి తొలగించడం జరిగింది. అధికారులు స్పందించి తొలగించిన కన్వియన్స్ డ్రైవర్ ని తిరిగి వీధుల్లోకి తీసుకోవాలని, లేని పక్షంలో మందమర్రి డివిజన్ వ్యాప్తంగా కార్మికునికి మద్దతుగా నిరసన, ఆందోళన పోరాటాలు సైతం చేస్తామని హెచ్చరించారు.