రక్షణలో ప్రతి ఉద్యోగి భాగస్వామి కావాలి

 

-సేఫ్టీ కమిటీ కన్వీనర్ ఆర్. నారాయణ రావు

 

ప్రజాబలం మందమర్రి మండల రిపోర్టర్ డిసెంబర్ 13 :

ఈరోజు 55 వ రక్షణ పక్షోత్సవాల లో భాగం గా సేఫ్టీ కమిటీ కన్వీనర్ ఆర్.నారాయణ రావు, జీఎం, (అర్ అండ్ డి ), మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ జి.దేవేందర్, ఏరియా సేఫ్టీ ఆఫీసర్ ఎం.రవీందర్, మందమర్రి లోని కే.కే ఓ.సి గనిని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సింగరేణి సంస్థలో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగి రక్షణలో భాగస్వామి కావాలని రక్షణ కమిటీ కన్వీనర్ ఆర్.నారాయణ రావు అన్నారు.
అనంతరం మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ జి. దేవేందర్ మాట్లాడుతు రక్షణ కోసం ఉద్యోగులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చేసిన రక్షణ పరికరాలను పనిముట్లను వాడాలని,రక్షణతో కూడిన ఉత్పత్తి సాధించాలని అన్నారు.
అనంతరం కమ్యూనికేషన్ సెల్ మందమర్రి ఏరియ వారిచే రక్షణ జాగ్రత్తల గురించి వివరిస్తూ ఉద్యోగులకు అర్థమయ్యే రీతిలో ప్రదర్శించిన లఘు నాటిక అందరినీ ఆకర్షించింది. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ మందమర్రి బ్రాంచ్ సెక్రటరీ సలేంద్ర సత్యనారాయణ, సి.ఎం.ఓ.ఏ.ఐ అధ్యక్షులు రమేష్, రఘు కుమార్ జి.ఎం సేఫ్టీ బెల్లంపల్లి రీజియన్, ఏ. ఎల్.ఎస్.వి సునీల్ వర్మ (డీ.జీ.ఎం ఆర్ అండ్ డి), వి.రామకృష్ణ,(డి.జి.ఎం ఈఅండ్ఎం సెంట్రల్ స్టోర్స్ కార్పొరేట్), జి.లక్ష్మి రాజు(ఎస్.ఎస్.ఓ జి.ఎం ఆర్ జి 1), ఏ. భాస్కరరావు (అడిషనల్ మేనేజర్ ఎన్విరాన్మెంట్ కార్పొరేట్), డాక్టర్ పి.లోకనాథ్ రెడ్డి (డి.వై మెడికల్ సూపర్ంటెండెంట్ ఆర్కే8 డిస్పెన్సరీ శ్రీరాంపూర్), శ్రీరామ్ ( సీనియర్ ఎమ్మెస్ అర్.అర్.టి, మందమర్రి ఏరియా ), టి. కిషన్ రెడ్డి (ఎలక్ట్రికల్ ఫోర్ మెన్), శ్రావణ్ కుమార్ ( మెకానికల్ ఫోర్ మెన్ ), కే.కే ఓ.సి ప్రాజెక్ట్ ఆఫీసర్ మల్లయ్య, గని మేనేజర్ రామరాజు, సంక్షేమాధికారి సందీప్, ఉద్యోగులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking