మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి జనవరి 27 : బాధిత కుటుంబానికి పరామర్శచిన మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు.కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటానని అన్నారు.మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట మండలంలోని దౌడపెల్లి గ్రామానికి చెందిన లక్ష్మారెడ్డి ఇటీవల అనారోగ్యంతో మరణించగా శనివారం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి,మనోధైర్యాన్ని కల్పించారు.అంతకు ముందు అయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.కష్ట కాలంలో పార్టీని ఆదుకున్న వారిని తానేప్పుడు మరచిపోనన్నారు.ప్రతి కార్యకర్తకు న్యాయం చేస్తామన్నారు.ఆయన వంట లక్షెట్టిపేట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పింగళి రమేష్, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు,గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు.
