హైదరాబాద్ ప్రజాబలం ప్రతినిధి:ముఖ్యమంత్రి ముఖ్య ప్రజా సంబంధాల అధికారిగా (సీపీఆర్ఓ) నియమితులైన బి. అయోధ్య రెడ్డి బుధవారం సీఎం ఎ. రేవంత్ రెడ్డి ని ఆయన నివాసంలో కలిశారు. పుష్పగుచ్ఛం ఇచ్చి ధన్యవాదాలు తెలిపారు. తనపై నమ్మకం ఉంచి సీఎం కార్యాలయంలో సీపీఆర్ఓగా నియమించినందుకు అయోధ్య రెడ్డి ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.