వేములవాడ – మార్చి 25 (ప్రజాబలం దినపత్రిక)
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి అనుబంధ దేవాలయం అయిన బద్ది పోచమ్మ ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. రాజరాజేశ్వర స్వామి దర్శనం అనంతరం బద్ది పోచమ్మ కు బోనాలు సమర్పించేందుకు బారులు తీరారు దీంతో ఆలయంలో పాటు పరిసర ప్రాంతాలు సందడిగా మారాయి. అమ్మవారి దర్శనం కోసం గంటల తరబడి క్యూలైన్లో భక్తులు నిలబడి దర్శించుకుంటున్నారు.
