గోషామహల్ ప్రజాబలం ప్రతినిధి: గోషామహల్ అసెంబ్లీ నియెజక వర్గంలోని గోషామహల్ లో యోగేష్ యాదవ్ కుటుంబం ఆధ్వర్యంలో జరిగిన తుల్జాభవాని అమ్మవారి పూజా కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా ఖైరతాబాద్ శాసన సభ్యులు దానం నాగేందర్ పాల్గోని అమ్మవారి ఆశీర్వాదం పొందారు.ఈ సందర్భంలో దానం నాగేందర్ మాట్లాడుతూ గ్రేటర్ హైదరాబాద్ ప్రజలందరు అమ్మవారి ఆశీర్వాదంతో సుఖశాంతులతో కలిసిమెలిసి ఉండాలని కోరుకున్న అని అన్నారు . ఈ కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ ఖైరాతాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యాక్షులు ఎస్.ధన్రాజ్ ,టీ.సతీష్,సంతోష్గుప్తా , వాసు ,సుభాష్, తదితరులు పాల్గోన్నారు.