ఇల్లందు ప్రతినిధి జనవరి 15 (ప్రజాబలం) ఇల్లందు నియోజకవర్గం కామేపల్లి మండలం పండితాపురం గ్రామంలో సంక్రాంతి సంబరాలు ఆనందోత్సాహాల మధ్య ఘనంగా జరిగాయిఈ వేడుకలలో డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్లి బాబు యాదవ్ మాట్లాడుతూ నేటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రజలు, ఖమ్మం జిల్లాలోని ప్రియతమ మంత్రుల నాయకత్వంలో ఖమ్మం జిల్లా ప్రజలు సుఖ సంతోషాలతో సంక్రాంతి సంబరాలను ఘనంగా జరుపు కుంటున్నారని హర్షం వ్యక్తం చేసి శుభాకాంక్షలు తెలిపారు నిరుపేదలకు 5 లక్షల రూపాయలతో ఇల్లు, వ్యవసాయ కూలీలకు 6000 రూపాయలు చొప్పున సాయం, కొత్తగా రేషన్ కార్డులు మంజూరి, మరియు మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా ఆరు గ్యారంటీల పథకం అమలు వుతున్నాయని గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా నూతన పథకాలతో ప్రజాపాలన కొనసాగిస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమం లోబానోత్ నరసింహనాయక్, శీలం పుల్లయ్య ఎల్.హెచ్ పి ఎస్ మండల మండల అధ్యక్షులు భూక్యా నాగేంద్రబాబు, ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు పాటిబండ్ల ప్రసాద్, యువజన నాయకులు బాదావత్ నాగరాజు, డేరంగుల తిరపయ్య రాయల నాగ శంకర్, షేక్ రబ్బానీ పాషా, బద్దల శేఖర్, మేకల లక్ష్మీనారాయణ, గుగులోత్ రవి బాదావత్ రవి, మరియు తదితరులు పాల్గొన్నారు
