మెదక్ తూప్రాన్ ప్రాజబలం న్యూస్:-
ప్రభుత్వ జూనియర్ కళాశాల తూప్రాన్ మెదక్ జిల్లా ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు జరుగుతున్న సందర్భంగా మెదక్ జిల్లా (డిఐఈఓ) డిస్టిక్ ఇంటర్మీడియట్ ఈవో సత్యనారాయణ కళాశాలను సందర్శించడం జరిగింది. ప్రయోగశాల శాల పరీక్ష నిర్వహణ తీరు పరిశీలించడం జరిగింది. తర్వాత ప్రథమ సంవత్సర విద్యార్థులు విద్యార్థులతో మాట్లాడి తరగతుల నిర్వహణ రాబోయే పబ్లిక్ పరీక్షలకు ఏ విధంగా సన్నద్ధం కావాలో తెలియడం జరిగింది. అదేవిధంగా అధ్యాపకులకు ఉత్తీర్ణత శాతం పెంచాలని తగు సూచనలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపల్ గోపీచంద్ బోధన, బోధ నేతర సిబ్బంది , అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.