రాజేంద్ర నగర్ ప్రజా బలం ప్రతినిధి 02 అక్టోబర్ 2023: రాజేంద్ర నగర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి పదంలో ముందంజలో ఉందని 12 వ వార్డ్ నుండి 22 వ వార్డ్ వరకు 18 పనులకు గాను 6.51 కొట్ల వ్యయంతో యూ.జి.డి. లైన్లు, సీ.సీ. రోడ్డు పనులకు శంకుస్థాపన చేయడం చాల ఆనందంగా ఉందని శాసన సభ్యుడు టి.ప్రకాష్ గౌడ్ తెలియ పరచారు, ఈ కార్యక్రమంలో బండ్లగుడా జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ బుర్ర మహేందర్ గౌడ్, మున్సిపల్ కమిషనర్ శరత్ చంద్ర, డిప్యూటి మేయర్ పి.రాజెందర్ రెడ్డి, బీ.ఆర్.ఎస్ పార్టీ అద్యక్షులు గోకరి సురెష్ గౌడ్, కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు, ప్రజా ప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు, తదితరులు తమ తమ సంతోషాన్ని వ్యక్త పరుస్తూ పాల్గొనడం జరిగింది.