వేములవాడ టౌన్, ( ప్రజాబలం ), సుప్రసిద్ధ శైవ క్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలోని గోశాలకు బుధవారం రోజున నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం మైలారం వాస్తవ్యులు వంచ రవీందర్ రెడ్డి ఐదు ట్రాక్టర్ల పశుగ్రాసాన్ని రాజన్న ఆలయ అధికారులకు అందజేసి రసీదులు పొందినారు. వీరికి రాజన్న ఆలయ అధికారులు ప్రత్యేక దైవ దర్శనం కల్పించారు.