పీపుల్ ఎంపవర్మెంట్ సొసైటీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నోటుబుక్స్, పెన్, పెన్సిల్స్ కిట్ లు, చాక్లెట్స్ పంపిణీ
మౌలాలి ప్రజాబలం ప్రతినిధి:హైదరాబాద్ మౌలాలి, లక్ష్మినగర్ లో ఉన్నటువంటి పీపుల్ ఎంపవర్మెంట్ సొసైటీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫౌండర్ జె. మేరీ ఫ్లోరెన్స్ మరియు కమిటీ మెంబెర్స్ నాగలక్ష్మి, ఫిల్లిప్స్, శిల్పారెడ్డి తో కలిసి ‘‘ఈశ్వర్ నగర్, మౌలాలి లో ఉన్నటువంటి గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్ చిల్డ్రన్స్ కి నోటుబుక్స్, పెన్, పెన్సిల్స్ కిట్ లు, చాక్లెట్స్ పంపీణ్ీ చేయటం జరిగింది. అలాగే ఈ స్కూల్ ప్రిన్సిపాల్ వెంకటరెడ్డి, టీచర్ నరసింహ రెడ్డి ఈ స్కూల్ గురించి పిల్లలకు కావాల్సిన వాటి గురించి చెప్పటం జరిగింది. ఈ ప్రోగ్రామ్ కి సహాయ సహకారం అందించిన ఆగష్టన్, యూనిస్, కృష్ణమోహన్, దేవానంద్ శాంతరాజ్, డి. లక్ష్మి, ఫిల్లిప్స్, నాగలక్ష్మి, శిల్పారెడ్డి వీరందరికి జె. మేరీ ఫ్లోరెన్స్ ధన్యవాదములు తెలియచేసారు.
