రాజేంద్ర నగర్ ప్రజా బలం ప్రతినిధి 21 జనవరి 2024: అయోధ్య రామమందిర చారిత్రాత్మక రామ్లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవ శుభ ఘడియలయిన సోమవారం 22 జనవరి 2024 రోజున ఉదయం 10 గంటలకు వీ ఆర్ ఫర్ సహాయోగ్ చారిటబుల్ ట్రస్ట్ ఆద్వర్యంలో మణికొండ పైప్ లైన్ రోడ్ లోగల లేబర్ అడ్డా వద్ద భక్త జనులందరూ ముగ్దులయ్యే విధంగా భజన కీర్తనలు వినిపిస్తూ విచ్చేసిన భక్తులందరికీ వారి నుదుటన కుంకుమ తిలక ధారణ గావిస్తూ, కోవిడ్ నిబంధనలను పాటిస్తూ 3 ప్లై సర్జికల్ మాస్క్ లు ఉచితంగా ఇవ్వడంతో పాటు పూజా ప్రసాదం ప్యాకెట్ల వితరణ మరియూ న్యూట్రిషన్ ఫుడ్ ప్యాకెట్లు భక్తులందరికీ ఉచితంగా ఇవ్వడానికి ఏర్పాట్లు గావించినారని ఇట్టి సదవకాశాన్ని ఉపయోగించుకొని శ్రీరాముని ప్రీతి పాత్రమైన దీవనలు గైకొనాలని ట్రస్ట్ సభ్యులు సాదరముగా తెలియ పరచినారు.