భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి జనవరి 22 (ప్రజాబలం) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ అధికారుల సంఘం ఆధ్వర్యంలో ముద్రించిన 2025 సంవత్సర క్యాలెండర్ను జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ఈ రోజు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసు అధికారులు మరియు సిబ్బంది సమస్యలను పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తామన్నారు.వారి సంక్షేమానికి అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు.ఎలాంటి సమస్యలు ఎదురైనా వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఏఆర్ డిఎస్పీ సత్యానారాయణ, కార్యాలయ ఏవో మంజ్య నాయక్, వెల్ఫేర్ ఆర్ఐ కృష్ణారావు, హోమ్గార్డ్స్ ఆర్ఐ నరసింహారావు,పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాసరావు ఉపధ్యాక్షుడు ఏశోబు,రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎం.వెంకటేశ్వర్లు, జానీమియా తదితరులు పాల్గొన్నారు.