మనికొండ ప్రజాబలం ప్రతినిధి:మనికొండ మునిసిపాలిటీ లోని హ్యూమన్ గారేజ్ ఫిజియొ థెరపీ సెంటర్ యొక్క డాక్టర్ చరణ్ తరపున శివపుర కాలనీ లోని శివాలయాన్ని దర్శించుకున్న భక్తులకు త్రాగు నీటి సౌకర్యం కల్పించారు అట్టి కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్ కే.రామకృష్ణ రెడ్డి, అధ్యక్షుడు శ్రీరాములు, కౌన్సిలర్ వసంత్ చౌహాన్, ప్రజా నాయకులు నరేష్, రాజు గౌడ్, గంగాధర్, దిలీప్, మధు, లక్ష్మిశ్రి తది తరులు పూజా కార్యక్రమాలలో పాల్గొని దైవ దర్శనం చేసుకుని మంచి నీటి వితరణ కార్య క్రమంలో పాల్గొన్నారు.