ప్రతి ఒక్కరికీ ఓటుపై అవగాహన అవసరం

ఓటుపై అవగాహన కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్​ నర్సింహారెడ్డి

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ప్రజాబలం ప్రతినిధి జూలై 10:
ఓటు వేసే ప్రతి ఒక్కరికీ తమ ఓటు పట్ల అవగాహన ఎంతో అవసరమని ఈ విషయంలో ఎన్నికల కమిషన్​ సూచనల మేరకు ఓటు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మేడ్చల్​ – మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్​ నర్సింహారెడ్డి అన్నారు. సోమవారం శామీర్​పేట జిల్లా కలెక్టరేట్​లోని ఓటు అవగాహనకై ఏర్పాటు చేసిన ప్రత్యేక కేంద్రంలో ఆయా వివరాలను తెలిపారు. జిల్లా కలెక్టరేట్​ కార్యాలయానికి వచ్చిన వారు ప్రత్యేకంగా ఉన్న గదిలోని ఎలక్ట్రానిక్​ ఓటింగ్​ యంత్రం (ఈవీఎమ్​)లో ఓటు ఎలా వేయాలనే వివరాలతో పాటు ఓటు వేసి తాము వేసిన ఓటు చెల్లిందా ? లేదా ? తాము వేసిన వారికే ఓటు వెళ్ళిందా అని కూడా తిరిగి పరిశీలించుకోవడానికి వీలుంటుందని అన్నారు. ఓటు హక్కు ఎంతో విలువైనదని దీనిని తప్పకుండా వినియోగించుకోవాల్సిందిగా అదనపు కలెక్టర్​ నర్సింహారెడ్డి కోరారు. దీంతో పాటు జిల్లా కలెక్టరేట్​లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సెల్​ ద్వారా ఇక్కడకు వచ్చే వారు ఓటరు అవగాహనకు సంబంధించిన వివరాలతో పాటు ఈవీఎమ్​లో డెమోను వినియోగించుకోవాల్సిందిగా పేర్కొన్నారు. ఈ సందర్భంగా కలెక్టరేట్​లోని అధికారులతో పాటు అక్కడకు వచ్చిన ప్రజలతో ఈవీఎమ్​లలో ఓటు వేయించి ఈవీఎం ద్వారా ఓటు పడిందీ, లేనిదీ వారికి ప్రత్యక్షంగా తెలిపి వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారిణి చంద్రావతి, కలెక్టరేట్​ ఏవో వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

 

Leave A Reply

Your email address will not be published.

Breaking