సోషల్‌ విూడియాతో తప్పుడు ప్రచారం మంత్రి తలసాని

హైదరాబాద్‌ ముషీరాబాద్‌ స్టీల్‌ బ్రిడ్జి ఓపెనింగ్‌ సందర్భంగా జరిగిన సంఘటనపై మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ స్పందించారు. మంత్రి మాట్లాడుతూ మంత్రి కేటీఆర్‌ వచ్చిన సందర్భంగా ఎక్కువ రద్దీ ఏర్పడిరది. ఓ వ్యక్తి నా కాలు తొక్కుతూ ముందుకెళ్లాడు. నా కాలుకు గాయమై రక్తమొచ్చింది. ఆ సందర్భంగా నే ఆ వ్యక్తిని నెట్టి వేశాను. సోషల్‌ విూడియాలో దీన్ని పదే పదే ప్రచారం చేస్తున్నారు. అతను బైంసా అగ్రికల్చర్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రాజేష్‌ కుమార్‌ బాబు అని తెలిసింది. ఆయన గిరిజన బిడ్డా వెంటనే ఆయనకు ఫోన్‌ చేసి సారి చెప్పాను. దీనిపై కావాలనే నాపై సోషల్‌ విూడియాలో ప్రచారం చేస్తున్నారు. నేను బడుగు బలహీన దళిత, మైనార్టీ గిరిజన వర్గాల గొంతుకను. తెలంగాణ లో జరిగేవ సేవాలాల్‌, కొమురం భీం జయంతి కార్యక్రమాలు ముందుండి చేస్తాను. ఆరోజు జరిగిన ఘటనపై వాళ్ళ మనోభావాలు దెబ్బతింటే క్షమాపణ చెప్పుతున్నానని అన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking