ఖమ్మం ప్రతినిధి జనవరి 4 (ప్రజాబలం)ఖమ్మం నగరం మామిళ్లగూడెం కు చెందిన కప్పగంతు సీతమహా లక్ష్మి(82) గారి మృతి పట్ల మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సంతాపం వ్యక్తం చేశారుగురువారం వారి నివాసంలో ఉంచిన ఆమె భౌతికకాయాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు వారి కుమారులు రామకృష్ణ, వేణుగోపాల్ ఇతర కుటుంబ సభ్యులను కలిసి ఓదార్చారు సీతామహాలక్ష్మి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు నివాళులు అర్పించిన వారిలో స్తంబాద్రి లక్ష్మి నరసింహ స్వామి(గుట్ట) ఆలయ కమిటీ మాజీ చైర్మన్ గోలి చిన్నా, గోలి అనూప్ తదితరులు ఉన్నారు.