ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఆగస్టు 03 : మంచిర్యాల జిల్లాలోని దండేపల్లి మండలమలోని గూడెం గ్రామంలో ఉచిత నట్టల నివారణ,గాలికుంటూ వ్యాధి నివారణ టీకాల ఈ కార్యక్రమాన్ని స్థానిక ఎం పి టి సి తోట మోహన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీనియర్ డాక్టర్ ధన్ రాజ్ మాట్లాడుతూ…833 పశువులకు గాలికుంటూ వ్యాధి నివారణ టీకాలు,850 పశువులకు నట్టల నివారణ మందులు పంపిణీ చేశామన్నారు.ఈ కార్యక్రమంలో పశువైద్య సిబ్బంది ఏం.ఏ ఖాళీక్ అజీమ్ జూనియర్ వెటర్నరీ ఆఫీసర్,ఏం.డి ఇబ్రహీం షరీఫ్ లైవ్ లైవ్ వెటర్నరీ లైవ్ స్టాక్ ఆఫీసర్,కృష్ణవేణి, జూనియర్ వెటర్నరని ఆఫీసర్ తిరుపతి, సత్తయ్య, యాకుబ్ అలీ,కుమార్, గోపాల మిత్రలు ప్రేమలత, శ్రీనివాస్ పెద్ద ఎత్తున రైతులు పాల్గొన్నారు.