గోషామహల్ ప్రజాబలం ప్రతినిధి:గోషామహల్ అసెంబ్లీ నియోజకవర్గంలోని బేగంబజార్ మున్సిపల్ డివిజన్లో ఇంటింటికీ ఓటు ను అభ్యర్థిస్తూ గోషామహల్ ఎమ్మెల్యే టి.రాజాసింగ్ పాదాయాత్ర సాగిస్తున్నాడు.ఇందులో భాగంగా ఉస్మాన్షాయి కి చేరుకున్న పాదాయాత్ర కార్యక్రమానికి గలిబె సత్యనారాయణ బిజేపీ అభ్యర్థి టీ.రాజాసింగ్ బేగంబజార్ డివిజన్ కార్పోరేటర్ జి.శంకర్ యాదవ్ కు స్వాగతం పలుకుతూ శాలువాలు కప్పి సన్మానించడం జరిగినది.ఈ సందర్భంగా గలిబె సత్యనారాయణ మాట్లాడుతూ మేమందరం టీ.రాజాసింగ్కు మద్దతుగా నిలుస్తామని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో గలిబె విశాల్ వంజరి వెంకటేష్ యాదవ్ తదితరులు పాల్గోన్నారు.
