మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా పరిషత్ సీఈవో దేవసహాయం
ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జనవరి 22:
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని ఈనెల 23న (మంగళవారం) జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించనున్నట్లు జిల్లా పరిషత్ సీఈవో దేవసహాయం సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలిపారు. జిల్లా పరిషత్ ఛైర్మన్ శరత్ చంద్రారెడ్డి అధ్యక్షతన ఉదయం 10.30 గంటలకు ఈ సమావేశం జరుగుతుందని సీఈవో పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ గౌతమ్తో పాటు జిల్లా స్థాయి అధికారులు హాజరవుతారని తెలిపారు. ఈ సమావేశానికి జిల్లాలోని జడ్పీటీసీలు, అన్ని శాఖల అధికారులు పూర్తి సమాచారంతో హాజరు కావాలని సీఈవో దేవసహాయం స్పష్టం చేశారు.