ప్రజాబలం మంచిర్యాల నియోజకవర్గం రిపోర్టర్ ఏప్రిల్ 07 : మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట ఎస్సైగా గోపతి సురేష్ సోమవారం ఉదయం స్థానిక పోలీస్ స్టేషన్లో బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ ఇంతకాలం ఎస్సైగా పనిచేసిన సతీష్ కొమురంభీం అసిఫాబాద్ జిల్లాకు బదిలికావడంతో ఆయన స్థానంలో హాజీపూర్ ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న సురేష్ బదిలీపై వచ్చారు.ఈ సందర్బంగా ఎస్సై మాట్లాడుతూ…శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.