ప్రజా ప్రయోగార్థం నీటి సరఫరా లైన్ పెంచండి

రాజేంద్రనగర్ నియోజకవర్గ ప్రజాబలం ప్రతినిధి 21 మార్చి 2025
హైదరాబాద్ నగరంలోనే అభివృద్దికి మారు పేరుగా పేరుగాంచిన ప్రాంతాలలో మణికొండ మునిసిపాలిటీ ప్రథమంగా ఉన్నదని అట్టి ప్రాంతంలో 1987 వ సంవత్సరంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు కరకమలములచే మధ్యతరగతి ప్రజలకు 90 గజాల వైశాల్యం గల ప్లాట్ లను వితరణ చేయడం జరిగినది, అట్టి చిన్నపాటి స్థలంలో మధ్య తరగతి కుటుంబ సభ్యుల సంఖ్యా పరంగా పెరుగుతూ వచ్చినను త్రాగు నీటి సరఫరాకు ఎప్పుడో పాత కాలంలో వేసిన 4 ఇంచిలా పైప్ లైన్ ద్వారా వచ్చే నీరు సరిపోవడం లేదని అందుకు గాను శుక్రవారం రోజున స్థానికులు మణికొండ జలమండలి 18 వ డివిజన్ అధికారిని కలసి ప్రజా ప్రయోగార్థం పాత లైన్ స్థానంలో కొత్తగా 6 లేదా 8 ఇంచీల పైప్ లైన్ వేసి నీటి సరఫరా పెంచ వలసినదిగా వినతి పత్రం అంద జేయడంలో కీలక పాత్ర పోషించిన భాను చందర్, హుస్సేన్, దీపక్ సింగ్, భరత్, దిపక్, సంగం శ్రీకాంత్ తది తరులు

Leave A Reply

Your email address will not be published.

Breaking