మహా రక్తదాన శిబిరం

 

– 23 న జోగిపేట్ పోలీస్ స్టేషన్ శాఖ ఆధ్వర్యంలో

అందోల్ నియోజకవర్గం ప్రతినిధి మార్చి 21 (ప్రజాబలం ) స్వాతంత్రం కోసం ప్రాణాలర్పించిన, యోధులు భగత్ సింగ్, శివరాం, రాజగురుల, వర్ధంతి సందర్భంగా, ఈనెల 23వ తేదీ ఆదివారం నాడు జోగిపేట పోలీస్ శాఖల ఆధ్వర్యంలో మహా రక్తదాన శిబిరం,కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు, జోగిపేట ఎస్సై పాండు,తెలిపారు పోలీస్ శాఖల ఆధ్వర్యంలో నిర్వహించే, ఈ రక్తదాన శిబిరంలో, దాతలు పెద్ద సంఖ్యలో వచ్చి పాల్గొని విజయవంతం చేయాలని ఈ రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేసే దాతలకు, సర్టిఫికెట్, అందిస్తామని అన్నారు, రక్తదానం చేసేవారు ముందుగా, సెల్ నంబర్ 8374115556, లో సంప్రదించి పేర్లు నమోదు చేసుకోవాలని, తెలియజేశారు, ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలని, రక్తదానం ప్రాణదానం తో సమానం అని ఎస్సై పాండు, అన్నారు, అన్ని దానాలలో కన్నా రక్తదానం ఉత్తమమైనదని, పోలీస్ శాఖలో నిర్వహించే రక్తదాన శిబిరాన్ని దాతలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు, ఈ రక్తదాన శిబిరం జోగిపేట పోలీస్ స్టేషన్ ఆవరణలో జరుగుతుందని ఉదయం 9, గంటల నుంచి సాయంత్రం 4, గంటల వరకు ఈ రక్తదాన శిబిరం, కొనసాగుతుందని జోగిపేట ఎస్సై పాండు, తెలియజేశారు…

Leave A Reply

Your email address will not be published.

Breaking