మోదీ పాలనలో భారతదేశం ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది: ప్రహ్లాద్ జోషి

 

మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలోని రావల్ కోల్, సైదోని గడ్డ తాండ గ్రామ పంచాయతీలలో జరిగిన వికసిత భారత్ సంకల్ప యాత్ర లో పాల్గొన్న కేంద్ర బొగ్గు, గనులు, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషి

3 జనవరి, 2024

దేశం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ జరుపుకుంటున్న ఈ సమయంలో, మనం వికసిత భారత్ సంకల్ప యాత్ర ను
జరుపుకుంటున్నామని, 2008, 09 సమయంలో భారత్ ఆర్థిక వ్యవస్థని 5 బలహీన ఆర్థిక వ్యవస్థ లో ఒకటిగా చూసేవారని, ప్రధాని మోదీ సమర్థ పరిపాలన ఫలితంగానే బలమైన 5 ఆర్థిక వ్యవస్థ లలో ఒకటిగా నేడు దేశం నిలిచిందని కేంద్ర బొగ్గు, గనులు, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషి అన్నారు. మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా రావల్ కోల్, సైదోని గడ్డ తాండ గ్రామ పంచాయతీలలో జరిగిన వికసిత భారత్ సంకల్ప యాత్ర లో మంత్రి పాల్గొన్నారు.

కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి కేంద్ర ప్రభుత్వ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ కు చెందిన సమాచార డిజిటల్ వాహనాన్ని వీక్షించారు.ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ పదేళ్ల పాలనలో భారత్ ప్రపంచంలోనే 5వ అతి పెద్ద ఆర్ధిక వ్యవస్థ గా అవతరించిందని, దేశ ఆర్థిక పరిస్థితి మారుతోంది, దాని ఫలం ప్రతీ పేదవాడికి చేరువవ్వాలన్నారు.కేంద్ర ప్రభుత్వం గత 10 సంవత్సరాలలో సాధించిన ప్రగతిని ఆయన వివరించారు.

కేంద్రం ప్రవేశపెట్టిన పథకాలు, లబ్ధిదారుల విజయగాథను ‘వికసిత భారత్ సంకల్ప యాత్ర’ చెబుతోంది. ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించడంతోపాటు పథకం ప్రయోజనాలను పొందని వారికి అందజేయడమే ఈ డిజిటల్ వాహనం ఉద్దేశమని ఆయన తెలియజేశారు.

తెలంగాణ కు అందించిన నిధుల గురించి మంత్రి మాట్లాడుతూ,గ్రాంట్ ఇన్ ఎయిడ్ లో రాష్ట్రానికి రూ.2.5 లక్షల కోట్లు ఇవ్వడం జరిగిందని, రహదారుల అభివృద్ధికి రూ.93000 కోట్లు, రైల్వే ల అభివృద్ధికి గత 5 సంవత్సరాలలో రాష్ట్రానికి రూ.4500 కోట్లు ఇచ్చినట్లు మంత్రి తెలిపారు.

పిఎం ఉజ్వల యోజన ద్వారా 10 ఏళ్లలో 9.5 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఉచితంగా ఇవ్వడం జరిగిందని, దీని వల్ల దేశంలో మనం పొగ రహిత వంటిల్లు చూస్తున్నాం. గ్యాస్ మన దగ్గర ఉత్పత్తి బాగా తక్కువగా ఉంది.మనం బయటి దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం కానీ పిఎం ఉజ్వల ద్వారా రూ 600 కే మోదీ ప్రభుత్వం అందజేస్తుంది. మన ఇరుగు పొరుగు దేశాలలో ఇంత చౌకగా దొరకవు. కేవలం ప్రధాన మంత్రి ద్వారా నే ఇది సాధ్యం అయ్యింది

గ్రామాలకు నీటి సరఫరా చేయాల్సిన బాధ్యత గ్రామ పంచాయతీలది, రాష్ట్ర ప్రభుత్వానిది … కానీ ప్రతీ గ్రామాన్ని చేరుకోవడానికి హర్ ఘర్ నల్ జల్ , జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి మంచి నీటి కుళాయి ఏర్పాటు చేశారు.80 కోట్ల మందికి ప్రతీ నెలా 5 కిలోల బియ్యం 5 సంవత్సరాల క్రితమే ప్రారంభమైంది. చిన్న వ్యాపారాలు చేసే వారికి ఎలాంటి గ్యారంటీ లేకుండా రుణాలు ఇవ్వడం సులభతరం చేసింది మోదీ ప్రభుత్వం.వీధి వర్తకులకు పీఎం స్వానిధి ద్వారా రుణాలు మంజూరు చేసి వారి ఉన్నతికి నరేంద్ర మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉంది.

కేంద్ర ప్రభుత్వం అందిస్తోన్న ప్రతి పథకం ప్రతీ ఇంటికి చేరుకోవాలనే లక్ష్యం తో మోదీ గ్యారంటీ వ్యాన్ వికసిత భారత్ సంకల్ప యాత్ర ద్వారా అందరికీ చేరుకుంటుంది.

అంతకు ముందు కేంద్ర ప్రభుత్వ సమాచారంతో కూడిన ఐఈసీ మెటిరియల్‌ను మంత్రి ఆవిష్కరించారు. రావల్ కోల్, సైదోని గడ్డ తాండ గ్రామ పంచాయతీ లలో ఏర్పాటు చేసిన వివిధ కేంద్ర ప్రభుత్వ స్టాళ్లను మంత్రి సందర్శించారు.

వివిధ పథకాల గురించి ప్రతి ఒక్కరికి తెలియజేయడానికి మరియు ప్రజలు నేరుగా వాటి నుండి లబ్ధి పొందేందుకు ఈ వాహనాలు దేశంలో తిరుగుతున్నాయి. ప్రజలు దీనిని మోడీ గ్యారెంటీ వాహనంగా పిలుస్తున్నారని ప్రహ్లాద్ జోషి అన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking