డిప్యూటీ మేయర్ శ్రీమతి మోతే శ్రీలత శోభన్ రెడ్డి
ఉప్పల్ ప్రజాబలం ప్రతినిధి:హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ శ్రీమతి మోతే శ్రీలత శోభన్ రెడ్డి మరియు టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు మోతే శోభన్ రెడ్డి తో కలిసి, జిహెచ్ఎంసి జోనల్ కమిషనర్ రవి కిరణ్ మరియు జిహెచ్ఎంసి అధికారులతో కలిసి తార్నాక డివిజన్లోని మల్టీ పర్పస్ హాల్ పనులను పరిశీలించారు.
ఈ సందర్బంగా, మల్టీ పర్పస్ హాల్ పనుల నాణ్యత మరియు పూర్తి చేసే గడువు పై సమీక్ష నిర్వహించారు. అనంతరం, ప్రొఫెసర్ జయశంకర్ స్టేడియంలో నిర్మాణంలో ఉన్న స్విమ్మింగ్ పూల్ను కూడా తనిఖీ చేసి, పనుల పురోగతిపై ఆరా తీశారు.
పనులు నాణ్యతగా మరియు సమయానికి పూర్తి చేయాలంటూ సంబంధిత అధికారులను ఆదేశించారు. నగర ప్రజలకు మరింత మెరుగైన సౌకర్యాలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్లు ఈ సందర్బంగా డిప్యూటీ మేయర్ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పలు కాంగ్రెస్ నాయకులు స్థానికులు అధికారులు పాల్గొన్నారు.