మనికొండ ప్రజాబలం ప్రతినిధి:మనికొండ అలకాపుర్ మహాత్మా గాంధీ పార్క్ వద్ద నిన్న ఉదయం 01-03-2023 రోజున జరిగిన కౌన్సిలర్ నవీన్ కుమార్ పై జరిగిన దాడిని బీ ఆర్ ఎస్ పార్టీ మనికొండ శాఖ తీవ్రంగా ఖండిస్తూ, బాధ్యత యుతమైన బీ జే పీ పార్టీ హోదాలో రాష్ట్ర నాయకులు సిద్దిపేట ఇంచార్జీ అంజన్ కుమార్ గౌడ్, జిల్లా నాయకులు మరియు మున్సిపల్ వైస్ చైర్మన్ నరేందర్ రెడ్డి తమ సహచర కౌన్సిలర్ పై అనుచిత అసభ్యకర వ్యాఖ్యలు చేయడం వారి హోదాకు తగదు. ఇలాంటి ఘటనలు పునరావృతం చేయకుండా గౌరవ కౌన్సిలర్ ను బేశరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని బీ ఆర్ ఎస్ పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నాము లేనియెడల తగు కార్యాచరణ సరిjైున సమయంలో తెలియ పరుచగలము. ఇట్టి విషయమై ప్రజా ప్రతినిధి నవీన్ కుమార్ కు పార్టీ పూర్తి అండ దండగా ఉంటూ, భవిష్యత్తులో బీ ఆర్ ఎస్ పార్టీ కార్య కర్తల జోలికి ఎవ్వరూ వచ్చిన తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నము, ఖబర్డార్.
ఇట్లు
శ్రీరాములు, బీ ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షుడు.
Prev Post