ఖమ్మం ప్రతినిధి సెప్టెంబర్ అయింది ప్రజాబలం ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ సంక్షేమ పథకాలకు, స్థానిక ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి వ్యక్తిగత సహాయ సహకారాలకు ఆకర్షితులై తిరుమలాయపాలేం మండలం మంగలి బండ తండాకి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ధారావత్ మురళి,వార్డు మెంబర్ ధారావత్ శంకర్ మరియు 24 కుటుంబాలు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి సమక్షంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బిఆర్ఎస్ పార్టీలోకి చేరారు.