సమన్వయంతో పనిచేసి చిన్నారులను బాల్యాన్ని కాపాడుదాం: నిర్మల్ జిల్లా ఎస్పి డా.జి.జానకి షర్మిల

ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..

 

అన్ని ప్రభుత్వ విభాగాలతో పాటు స్వచ్చంధ సంస్థలు సమన్వయంతో కల్సి పని చేసి వెట్టిచాకిరీ నుండి చిన్నారులను రక్షించి వారి బాల్యాన్ని కాపాడుకుందామని జిల్లా ఎస్పి డా.జి.జానకి షర్మిల ఐపిఎస్.,గారు అధికారులకు పిలుపునిచ్చారు

జూలై మొదటి తారీఖు నుండి 31 వరకు ఆపరేషన్ ముస్కాన్ 10 వ విడతలో భాగంగా నిర్మల్ జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు నిర్మల్ జిల్లాలకు చెందిన చైల్డ్ వెల్ఫేర్, చైల్డ్ ప్రోటక్షన్, రెవన్యూ, విద్యా, వైద్యా, లేబర్, విభాగాలకు చెందిన అధికారులతో పాటు సూర్య నారాయణ అడిషనల్ ఎస్పి గారి పర్యవేక్షణ లో బరోసా సెంటర్ ఇంచార్గ్ అధికారి జ్యోతిమని ఎస్ ఐ గారు సోమవారం పోలీస్ కార్యాలయంలో ప్రత్యేక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముస్కాన్ పదవ వ విడత గోడ ప్రతిని ఆవిష్కరించారు చేయటం జరిగింది.
ఈ సందర్బంగా ఎస్పీ గారు మాట్లాడుతూ. తప్పిపోయిన, వదిలేయబడిన, నిర్లక్షమ్ చేయబడిన, రోడ్డుపై భిక్షాటన చేస్తున్న, బాల కార్మికులుగా పనిచేస్తున్న 18 సంవత్సరాల వయస్సు లోపు పిల్లలను గుర్తించి వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి అప్పగించడం లేదా పునరావాస కేంద్రాలకు తరలించాలన్నారు. జిల్లాలో ఎక్కడైనా బాలకార్మికులు కనబడితే వెంటనే డయల్ 100 కి గాని, 1098 చైల్డ్‌ లైన్‌ టోల్‌ ఫ్రీ నెంబర్‌కు గాని ఫోన్‌ చేసి సమాచారం అందించే విధంగా ప్రజల్లో అవగాహన పెంచాలని, ఇకపై రానున్న రోజుల్లో బాలకార్మికుల నిర్మూలకై ప్రతి నెల ఒక కార్యక్రమాన్ని నిర్వహించబడేందుకుగాను ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ముఖ్యంగా ప్రతినెల ఒకోక్క రంగాన్ని ఎంచుకోని ఆయా రంగాల్లో పనిచేసే బాలకార్మికులను గుర్తించి వారిని వెట్టిచాకీరి నుండి విముక్తి కలిగించాలని, ముఖ్యంగా చిన్నారులతో వెట్టిచాకిరి చేయించుకోవడం చట్యరీత్యానేరమని, ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని ప్రజలకు సూచించారు.
ఈ సమావేశంలో సోన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ నవీన్ కుమార్, ఎస్.ఐ జ్యోతిమని, జిల్లాలో గల చైల్డ్ వెల్ఫేర్, లేబర్ శాఖ, ఏ సి ఎల్, సి డబ్ల్యూ సి, డి సి పి ఓ,సి పి ఓ, ఏ.హెచ్.టి.యు సిబ్బంది మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking