అందోల్ నియోజకవర్గం ప్రతినిధి (మే19 ప్రజాబలం) సంగారెడ్డి జిల్లా, అందోల్ నియోజకవర్గం పరిధిలోని చౌటకూర్ మండలం కొర్పుల్ గ్రామానికి చెందిన, నారన్నగారి వెంకట్ రెడ్డి, తండ్రి మానికిరెడ్డి, వయసు 53, సంవత్సరాలు వృత్తి, ప్రైవేట్ ఉద్యోగి, ఇతడు నిన్నటి రోజున అనగా 18,మే 2025, నాడు అందాజ 3 గంటల సమయంలో అతని బోరు మోటర్, పనిచేయందున, మంజీరా నది యొక్క ఏట్లో ఉన్న, బోరు మోటర్ ను పైకి తీయడానికి వెళ్లి, అతను ఏట్లోకి దిగిన తర్వాత ఏటిలో ఉన్న, గుర్రపు డెక్క కాలుకు తగులుకొని, నీటిలో మునిగి ఊపిరాడక చనిపోయినాడు అని, పుల్కల్ ఎస్సై,క్రాంతికుమార్ పటేల్, తెలిపారు, ఈ విషయమై మృతుడి భార్య విజయలక్ష్మి, వయసు 40, సంవత్సరాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుందని అన్నారు,