ఆందోల్ నియోజకవర్గం ప్రతినిధి (మే19 ప్రజాబలం) సంగారెడ్డిజిల్లా, హైదరాబాదులోని రవీంద్ర భారతి ప్రధాన వేదికపై, ఎంతో వైభవంగా జరిగిన, అనంత,సాహిత్య, సాంస్కృతిక, వేదిక,ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా, అందోల్ మండలం తలెల్మ గ్రామానికి చెందిన కవి, పండితులు, తెలుగు ఉపాధ్యాయులు, అయినటువంటి ఎం, సంజీవులు, రచించిన, సంజీవి శతకం, ప్రముఖ కవి, ఎం ఎల్ సి,వాగ్గేయకారులు డా, గోరెటి వెంకన్న, చేతుల మీదుగా ఆవిష్కరించబడింది, సరళ సుందరమైన భాషలో, చక్కని దార శుద్ధితో ఆలరారే, ఈ శతకం, బద్దెన కవి, సుమతీ శతకము అంతటి స్థాయిలో ఉన్నదని పలువురు వ్యక్తులు అభినందించారు, ఆవిష్కర్త గోరేటి వెంకన్న, అనంత,సాహిత్య, సాంస్కృతిక, వేదికలో, ఇటువంటి గొప్ప గొప్ప కవులు,వెలుగులోకి రావడం సంతోషంగా ఉంది అన్నారు, తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి, డా,నామోజు బాలచారి, కవి దంపతులను సత్కరించి అభినందించారు, శ్రీ సంజీవి కలం పేరుతో, కవిత్వం రచించే కవి, సంజీవులు, మాట్లాడుతూ, పద్యం అంటే తనకు ప్రాణపదమని, అనంత సంస్థల్లో చేరిన తర్వాత, అక్కడి పెద్దల ఆశీర్వాదంతో, తోటి కవుల ప్రోత్సాహంతో, నిరంతరం పద్య రచన చేయడం జీవితంలో భాగమైంది అన్నారు, రవీంద్ర భారతి వంటి ప్రతిష్టాత్మకమైన వేదిక పైన తన తొలి రచన, ఆవిష్కరించబడటం అదృష్టమని, తనకు ఆ భాగ్యం కలిగించిన అనంత, అధ్యక్ష కార్యదర్శులకు, ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు, మరి విశేషంగా అనంత వ్యవస్థాపకులు, అభినవ దాశరథి, శ్రీ దొరవేటి చే(ఆ ) కి, హృదయపూర్వక కృతజ్ఞతలు అన్నారు, త్వరలో తలెల్మా, గ్రామస్తులు బంధుమిత్రులు, సహ ఉద్యోగుల సమక్షంలో, మరొక్కసారి పుస్త కావిష్కరణ, జరుపుకోగలమని వారు ప్రకటించారు.