ఖమ్మం ప్రతినిధి జనవరి 31 (ప్రజాబలం) ఖమ్మం తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఫిబ్రవరి 1వ తేదీన గురువారం మహబూబాబాద్, డోర్నకల్ నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఈ మేరకు మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇన్ చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. పర్యటనలో భాగంగా మధ్యాహ్నం రెండు గంటలకు మహబూబాద్ లోని బాలాజీ ఫంక్షన్ హాల్లో రానున్న పార్లమెంటు ఎన్నికల్లో అనుసరించాల్సి న విధివిధానాలపై ఎమ్మెల్యే, నియోజకవర్గ ముఖ్యనాయకులతో, సాయంత్రం నాలుగు గంటలకు డోర్నకల్ నియోజకవర్గం మరిపెడ బంగ్లాలోని వంటి కొమ్ము లక్ష్మారెడ్డి ఫంక్షన్ హాల్లో రానున్న పార్లమెంటు ఎన్నికల్లో అనుసరించాల్సి న విధివిధానాలపై ఎమ్మెల్యే, నియోజకవర్గ ముఖ్యనాయకులతో సమావేశం అవుతారని తెలిపారు. కావున ఆయా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో ఆ సమావేశానికి హాజరు కావాలని దయాకర్ రెడ్డి కోరారు