రామప్ప ను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తాం మంత్రి సీతక్క

ములుగు ప్రజాబలం ప్రతినిధి: పంచాయితీ రాజ్‌డ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క సోమవారం నాడు కుటుంబ సమేతంగా శ్రీ రామప్ప రామలింగేశ్వర దేవాలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
తరువాత సీతక్క మాట్లాడుతూ ఇటీవలే కాలం లో రామప్పకు ప్రపంచ వారసత్వ గుర్తింపు రావడం జరిగిందని కాకతీయులు నిర్మించిన రామప్ప ఈనాటికీ చెక్కు చెదరకుండాఉందని
అపురూప శిల్ప సంపదకు ప్రసిద్ధి. కన్ను ఆర్పకుండా చేసే శిల్పాలు, అరుదైన లేత ఎరుపు రాతి నిర్మాణం.. శాండ్బాక్స్‌ సాంకేతికత, నీటిలో తేలియాడే రాళ్లతో పైకప్పు నిర్మాణం? వంటి ఎన్నో ప్రత్యేకతలు రామప్ప సొంతం అని రామప్ప ను టూరిజం హబ్‌ గా అభివృద్ధి చేస్తామని కాకతీయ రాజులు గా సమ్మక్క సారలమ్మ పాలనలో రామప్ప లాంటి నిర్మాణాలు జరిగాయి అని, కాకతీయులు ఎక్కడ ఉన్నా టెంపుల్‌ టౌన్‌ కు ప్రాధాన్యత ఇచ్చారన్నారు రామప్ప కు యూనొస్కో గుర్తింపుకు కృషి చేసిన ప్రోపెసర్‌ పాండు రంగ రావు,పాపారావు ల కృషి ఎనలేనిది అని సీతక్క అన్నారు అందరి సహకారం తో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం అని మంత్రి సీతక్క అన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking