సోమవారం గాంధీ భవన్‌ మంత్రులతో ముఖాముఖి కార్యక్రమానికి మంత్రి తుమ్మల రాక…

నాంపల్లి ప్రజాబలం ప్రతినిధి:ఉదయం 11 గంటల నుంచి ముఖాముఖి కార్యక్రమం ప్రారంభం..
టీపీసీసీ అధ్యక్షులు మహేష్‌ కుమార్‌ గౌడ్‌ ఎమ్మెల్సీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గాంధీ భవన్‌ లో మంత్రులతో ముఖాముఖి కార్యక్రమంలో సోమవారం నాడు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొననున్నారు.

షెడ్యూల్‌ ప్రకారం శుక్రవారం నాడు జరగాల్సిన మంత్రులతో ముఖాముఖి కార్యక్రమం టీపీసీసీ అధ్యక్షులు మహేష్‌ కుమార్‌ గౌడ్‌ తన స్వంత జిల్లా నిజామాబాద్‌ జిల్లా లో పర్యటించడం తో వాయిదా పడిన విషయం తెలిసిందే.
కాగా ముందుగానే ప్రకటించినట్టుగా సోమవారం నాడు ఈ కార్యక్రమాలు కొనసాగుతాయి. కాగా ఇప్పటికే మొదటి రోజు వైద్య, ఆరోగ్య శాఖదామోదర్‌ రాజా నర్సింహ , రెండో రోజు నీటి పారుదల శాఖ మంత్రి శ్రీ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి పాల్గొన్నారు. ఇదిలా ఉండగా సోమవారం నాడు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌ రావ్‌ పాల్గొనే ఈ కార్యక్రమంలో ప్రజలు, కాంగ్రెస్‌ కార్యకర్తలు భారీగా పాల్గొని సమస్యలు పరిష్కరించుకోవాలని టీపీసీసీ అధ్యక్షులు మహేష్‌ కుమార్‌ గౌడ్‌ పిలుపునిచ్చారు..

 

Leave A Reply

Your email address will not be published.

Breaking