జగిత్యాల, ఆగస్టు 19: మిషన్ భగీరథ పథకంలో పనిచేస్తున్న వందమంది కార్మికులు ఏఐటియుసిలో చేరారు. ఏఐటియుసిలో జగిత్యాల జిల్లా కార్యదర్శి ముక్రం ఆధ్వర్యంలో చేరిన కార్మికుల హక్కుల సాధన కోసం నిరంతర పోరాటం చేస్తామని ముక్రం అన్నారు. కార్మికుల రక్షణ, హక్కుల సాధన, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాల కల్పన కోసం ఏఐటియుసి ఆధ్వర్యంలో పోరాటాలకు సిద్ధమని ముక్రం అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి నాయకులు దేవదాస్, ధర్మయ్య, స్వామి, మహేష్, కార్మికులు బాలరాజు, శేఖర్, అనీల్, మధు తోపాటు పలువురు ఉన్నారు.