ఖమ్మం ప్రతినిధి మార్చ్ 25 (ప్రజాబలం) ఖమ్మం జిల్లా కూసుమంచి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నందు పాలేరు నియోజకవర్గ దైవ సేవకుల(పాస్టర్ల) ఆత్మీయ సమ్మేళన సదస్సు కార్యక్రమంలో పాల్గొన్న పాలేరు శాసనసభ్యులు శ్రీ కందాళ ఉపేందర్ రెడ్డి గారు ఈసందర్భంగా మాట్లాడుతూ పాలేరులో కొంతమంది మేమే పోటీ చేస్తామని ప్రచారం చేసుకుంటున్నారు,కచ్చితంగా నిలబడేది నేనే మీ అందరి ఆశీర్వాదంతో గెలిచేది నేనే.. నేను మంచి చేశాను అనుకుంటేనే మీరు నాకు ఓటేయండి.. అంతేకానీ చెడు చేసి ఓట్లు అడగను..కచ్చితంగా టిఆర్ఎస్ నుంచి నిలబడేది నేనే. అన్నారు.