భూపాలపల్లి జిల్లాలో వరద ప్రవాహంలో ఇప్పటికే ముగ్గురు గ్రామస్థులు కొట్టుకుపోగా, తాజాగా మరో మహిళ గల్లంతు అయ్యింది. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ రెస్క్యూ టీమ్స్ గ్రామానికి బయల్దేరాయి. అధికారులు ములుగు నుంచి బోట్లు తెప్పిస్తున్నారు. నీట మునిగిన మోరంచపల్లె గ్రామ ప్రాంతాల్లో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పర్యటించారు.
