ప్రజాబలం బెల్లంపల్లి నియోజకవర్గం రిపోర్టర్ ఫిబ్రవరి 26 : మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీ కృష్ణ,బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ తో కలిసి బుగ్గ శ్రీ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ పూజారులు,ఎంపీ,ఎమ్మెల్యేలకు ఘన స్వాగతం పలికారు.భక్తులతో కలిసి హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా గడ్డం వంశీ కృష్ణ మాట్లాడుతూ… రాజరాజేశ్వర స్వామి అనుగ్రహం ప్రజలందరికీ లభించి,సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను.ఆలయ అభివృద్ధికి మా సహాయం నిరంతరం కొనసాగుతుంది అని తెలిపారు.