మనోహరాబాద్, జనవరి 8 (ప్రజా బలం న్యూస్):
మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలములో నూతనంగా బాధ్యతలు చేపట్టిన తాహసిల్దార్ చంద్రశేఖర్ రెడ్డిని మనోహరాబాద్ మండలం ఎమ్మార్వో కార్యాలయంలో మేజర్ గ్రామ పంచాయతీ కాళ్ళకల్ సర్పంచ్ నత్తి మల్లేష్ ముదిరాజ్ ఆయనను మర్యాద పూర్వకంగా కలిసి ఈ సందర్భంగా వారితో కాసేపు మాటామంతి కలిపి పలు అభివృద్ధి పనులపై భూ సమస్యలపై చర్చించారు. అనంతరం వారిని కాళ్ళకల్ గ్రామ సభ్యులతో కలిసి శాలువాతో ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.