ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలి… బండి రమేష్

 

కూకట్పల్లి (ప్రజాబలం) ఏప్రిల్ 03: బాలాజీనగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన ఐజెక్స్ ఆయుర్వేదం హాస్పిటల్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని పంచకర్మ విభాగంను ప్రారంభించిన కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ మాట్లాడుతూ నిర్వాహకులకు చైర్మన్ నూకతోటి నాగరాజుకి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన వైద్య సేవలు అందించాలని డాక్టర్లకు సూచించారు. ఈ కార్యక్రమంలో బాలాజీ నగర్ డివిజన్ అధ్యక్షులు కృష్ణ రాజ్ పుత్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు దండగుల యాదగిరి , కాంగ్రెస్ యూత్ నాయకులు శివ చౌదరి, రమణ , కాంగ్రెస్ పార్టీ సీనియర్ మహిళా నాయకురాళ్లు స్వరూప గౌడ్, బండి సుధ, ఆస్పత్రి యాజమాన్యం తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking