జమ్మికుంట ప్రజాబలం ప్రతినిధి జూలై 30
జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని ఆటోనగర్ సమీపంలో సర్వే నంబర్ 275,76,77,78 లో 2006 సంవత్సరంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం సుమారు 300 నిరుపేద కుటుంబాలకు నివేషణ స్థలం మంజూరు చేసి పట్టాలు ఇచ్చింది. ఈ స్థలాలలో కొంతమంది ఆర్థిక స్తోమత కలిగిన వారు నిర్మాణాలు చేపట్టారు. స్తోమత లేని వారు జమ్మికుంటలో కిరాయిలలో జీవనం కొనసాగిస్తున్నారు. కాగా, నిరుపేదలకు పంపిణీ చేసిన నివేషణ స్థలాలను ఆక్రమించి ఆ స్థలంలో డంపింగ్ యార్డ్ నిర్మించి చెత్తను పారబోస్తున్నారు. విషయం తెలుసుకున్న సదరు బాధితులు అప్పటి బిఆర్ఎస్ ప్రభుత్వంలోని ప్రజా ప్రతినిధులు, అధికారుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగిన ఎవరూ పట్టించుకోకపోగా, చీదరింపులకు గురయ్యామని తెలిపారు. ఈ విషయమై తమకు న్యాయం చేయాలని మంగళవారం బాధితులు జమ్మికుంట మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ ఆయాజ్ కు వినతిపత్రం సమర్పించారు.
కమిషనర్ ఆయాజ్ మాట్లాడుతూ ఈ విషయమై పరిశీలించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టు వెల్లడించారు. తమకు ప్రభుత్వం కేటాయించిన స్థలమును డంపింగ్ యార్డుకు వాడుకుంటామని తెలిపారు. అయితే తమకు నిరుపేదలకు కేటాయించిన స్థలంలో తీసుకోబోమనీ చెప్పారు. ఈ సందర్భంగా నివేషణ స్థలాలు కోల్పోయిన పలువురు బాధితులు మాట్లాడుతూ 2006లో నిరుపేదలకు కేటాయించి ఇళ్ల స్థలాలు మంజూరు చేసింది. నేడు మళ్లీ నిరుపేదల సంక్షేమం కోరే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని చెప్పారు. కాబట్టి తమపై దయతలచి ఇక్కడినుండి డంపింగ్ యార్డ్ ను తక్షణమే తరలించాలి, మా నివేషణ స్థలాలు మాకు అప్పగించి న్యాయం చేయాలాన్నారు. లేనియెడల ఇక్కడే తాము టెంటు వేసుకొని నిరాహార దీక్షకు దిగుతామని అన్నారు. కార్యక్రమంలో షమీం, వడ్లకొండ వసంత, స్వరూప, సుమతి, కమల, సమత, మణెమ్మ , అనంత, సరోజన, శారద సంతోష్ రమ విజయ, మల్లీశ్వరి ,శ్రీలత, రమ, సత్తెమ్మ సారయ్య రాజేందర్, పాపమ్మ, భద్రయ్య,నాగిశెట్టి వెంకటేశ్వర్లు, చిట్టి పెద్దలు, ఎస్ సమ్మయ్య, శంకర్, అనిల్, గూడపు రమా, రాజలక్ష్మి, కనకం సరోజన, మల్లీశ్వరి, చిట్యాల విజయలక్ష్మి, ఇల్లందుల శారద తదితరులు పాల్గొన్నారు.