ఛాలెంజ్ గా విధులు నిర్వహించి ప్రజల మన్ననలు పొందాలి
పెండింగ్ కేసులపై నెల వారి సమీక్ష సమావేశం,
ప్లాన్ ఆఫ్ యాక్షన్ తో పని చేయాలి,
కేసు నమోదు నుండి చార్జిషీట్ వరకు ప్రతి విషయాన్నికూలంకషంగా పరిశోధన చేసి ఫైనల్ చేయాలి,
ఫోక్సో, గ్రేవ్ కేసుల్లో త్వరితగతిన ఇన్వెస్టిగేషన్ పూర్తి చేయాలి,
ప్రతి గ్రామాల్లో సిసి కేమేరాల సంఖ్య పెంచాలి,
ప్రతి కేసులో క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ ఉండాలి
జిల్లా ఎస్.పి శ్రీ.డి.ఉదయ్ కుమార్ రెడ్డి ఐ.పి.యెస్.
మెదక్ ప్రజాబలం న్యూస్ :-
మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్.పి శ్రీ. డి. ఉదయ్ కుమార్ రెడ్డి ఐ.పి.యెస్ గారు జిల్లా సిబ్బందితో నేర సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పెండింగ్ ఉన్న (అండర్ ఇన్వెస్టిగేషన్) కేసులలో గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసుల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్.పి శ్రీ. డి. ఉదయ్ కుమార్ రెడ్డి ఐ.పి.యెస్ గారు మాట్లాడుతు.. జిల్లాలో ఎక్కువగా నేరాలు జరిగే ప్రాంతాల్లో హాట్ స్పాట్ లను ఏర్పాటు చేసి అదునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి క్రైమ్ మ్యాపింగ్ తయారు చేసి అక్కడ నేరాల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలను సిబ్బందికి తెలియజేయడం జరిగింది. అలాగే గ్రేవ్ నాన్ గ్రేవ్ కేసులలో ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు ఏ విధంగా ఇన్వెస్టిగేషన్ చెయ్యాలి ఏ ఏ అంశాలు కోడికరించాలి తదితర అంశాల గురించి వివరించారు. ప్లాన్ ఆఫ్ యాక్షన్ తో పని చేసి జిల్లాకు మంచి పేరు తేవాలని అన్నారు. ప్రతి కేసులో క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ ఉండాలి. పూర్తి పారదర్శకంగా కేసులో ఇన్వెస్టిగేషన్ చేయాలి. కేసు నమోదు నుండి చార్జిషీట్ వరకు ప్రతి విషయాన్నికూలంకుషంగా పరిశోధన చేసి ఫైనల్ చేయాలి. ఫోక్సో, గ్రేవ్ కేసుల్లో త్వరితగతిన ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయాలి. ప్రతి అధికారికి పూర్తి ఇన్వెస్టిగేషన్, స్టేషన్ మేనేజ్మెంట్ తెలిసి ఉండాలని సూచించారు. లాంగ్ పెండింగ్ కేసులు త్వరగా చేదించాలి, కేసుల చేదనలో అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగించాలి, పెరుగుతున్న టెక్నాలజీని అందిపుచ్చుకోవాలి ఛాలెంజ్ గా విధులు నిర్వహించి ప్రజల మన్ననలు పొందాలి, క్రైమ్ అగెనెస్ట్ ఉమెన్ కేసుల్లో త్వరితగతిన ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి, కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయాలి. రిసెప్షన్, క్రైమ్ వర్టికల్, టెక్ టీమ్, స్టేషన్ రైటర్, కోర్టు డ్యూటీ ఆఫీసర్, తదితర వర్టికల్, విధులు నిర్వహించే అధికారులకు సిబ్బందికి పలు సూచనలు చేస్తూ వారి యొక్క పనితనాన్ని మరింత మెరుగుపరచాలని అధికారులకు సూచించారు. కేసు నమోదు నుండి చార్జిషీట్ వరకు ప్రతి విషయాన్ని కూలంకషంగా పరిశోధన చేసి ఫైనల్ చేయాలి. సైబర్ నేరాల నియంత్రణ గురించి సిసి కెమెరాల ఆవశ్యకత గురించి గ్రామాలలో పట్టణాలలోఆయా గ్రామాల పోలీస్ అధికారులు సిబ్బంది ప్రోయాక్టివ్ పోలీస్ సింగ్ విధులు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ శ్రీ. ఎస్. మహేందర్ తూప్రాన్ డి.ఎస్.పి.
శ్రీ వెంకట రెడ్డి ,సైబర్ క్రైమ్ డి.ఎస్.పి. శ్రీ. సుభాష్ చంద్ర బోస్, జిల్లా సిఐ లు ఎస్. ఐ లు సిబ్బంది పాల్గొన్నారు.