మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా లా ఆఫీసర్ చంద్రావతి,
ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఫిబ్రవరి 12: సోమవారం కలెక్టరేట్ కార్యాలయము లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 149 అర్జీ లను పి డి, డి ఆర్ డి ఓ పద్మజ తో కలిసి స్వీకరించడం జరిగిందని లా ఆఫీసర్ చంద్రావతి తెలిపారు. అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ, సమస్యలను పరిష్కరించాలని లా ఆఫీసర్ చంద్రావతి అధికారులను సూచించారు.
ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.