ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి జూలై 27 మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట మున్సిపల్ ఏరియా లోని ప్రభుత్వ సంక్షేమ వసతి గ్రుహాల్లో సీజనల్ వ్యాధుల ప్రభలకుండా జాతీయకీటక జనిత వ్యాధుల నియంత్రణ కార్యక్రమం లో భాగంగా మంచిర్యాల జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ అనిత ఆదేశాల మేరకు వెంకట్రావుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ సతీష్ కుమార్ ఆద్వర్యంలో శనివారం నాడు అన్ని హాస్టల్స్ లో అల్ఫాసైఫర్ మైత్రిన్ అనే దోమల మందును పిచికారీ చేసినట్లు డాక్టర్ సతీష్ కుమార్ తెలిపారు.
మళ్ళీ 45 రోజుల తర్వాత రెండవ రౌండ్ లో తిరిగి దోమల మందును పిచికారీ చేయనున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్ లు గఫూర్,వేణు,ఇసాక్, కాంట్రాక్టర్ మొండయ్య , ఆశావర్కర్స్ తదితరులు పాల్గొన్నారు.