నేడు దుండిగల్​లో డబుల్​ బెడ్​రూమ్​ ఇళ్ళ పంపిణీ చేయనున్న రాష్ట్ర మంత్రి కేటీఆర్​

డబుల్​ బెడ్​రూమ్​ ఇళ్ళ పంపిణీ ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్​ అమోయ్​ కుమార్​

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ప్రతినిధి ప్రజాబలం 20 సెప్టెంబర్:
మేడ్చల్​ – మల్కాజిగిరి జిల్లాలోని దుండిగల్​లో నిర్మించిన డబుల్​ బెడ్​రూమ్​ ఇళ్ళ పంపిణీ కార్యక్రమానికి గురువారం రాష్ట్ర మున్సిపల్​, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్​ రానున్నఆధ్వర్యంలో అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్​ అమోయ్​ కుమార్​ తెలిపారు. బుధవారం జిల్లా అదనపు కలెక్టర్​ విజయేందర్​రెడ్డి, ఆర్డీవో శ్యామ్​ప్రకాశ్​తో కలిసి దుండిగల్​లోని డబుల్​ బెడ్​రూమ్​ల వద్ద ఏర్పాట్లను కలెక్టర్​ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్​ అమోయ్​ కుమార్​ మాట్లాడుతూ కుత్భుల్లాపూర్​ నియోజకవర్గం పరిధిలోని దుండిగల్​లో గురువారం రాష్ట్ర మున్సిపల్​, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్​ చేతుల మీదుగా రెండో విడత డబుల్​ బెడ్​రూమ్​ల పంపిణీ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాల్సిందిగా అధికారులకు కలెక్టర్​ సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్​ అమోయ్​ కుమార్​ వెంట జిల్లా అదనపు కలెక్టర్​ విజయేందర్​రెడ్డి, ఆర్డీవో శ్యామ్​ప్రకాశ్​, సంబంధిత శాఖల అధికారులు తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking