మహేశ్వర్ రెడ్డి ఆమరణ నిరాహార దీక్ష ను పోలీసులు భగ్నం చేయడాన్ని తీవ్రం గా ఖండించిన రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి

ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా.. నిర్మల్ మాస్టర్ ప్లాన్ రాద్దుకై బీజేపి నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష 6 వ రోజుకు చేరుకోవడం, మహేశ్వర్ రెడ్డి గారి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో గత అర్ధరాత్రి 2 గంటల సమయంలో పోలీసులు మహేశ్వర్ రెడ్డి గారిని బలవంతంగా ఆసుపత్రికి తీసుకువెళ్లే క్రమంలో కార్యకర్తల తోపులాట చోటుచేసుకుంది. బలవంతంగా మహేశ్వర్ రెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించి, వైద్యులు చికిత్స ప్రారంభించడం తో,
బలవంతంగా గా మహేశ్వర్ రెడ్డి ఆమరణ నిరాహార దీక్ష ను పోలీసులు భగ్నం చేయడాన్ని తీవ్రం గా ఖండించిన రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి సంగీబావం తెలపడానికి సోమవారం నిర్మల్ జిల్లా కేంద్రం లోని ప్రభుత్వ ఆసుపత్రి కి రావడం జరిగింది. అనంతరం లాఠీ ఛార్జ్ లో గాయాల పాలైన పలువురు కార్యకర్తలను, రైతులను పరామర్శించారు.అనంతరం కిషన్ రెడ్డి గారు మాట్లాడుతూ.
నిర్మల్ లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దుర్మార్గ పాలన తెలంగాణ వ్యాప్తంగా తెలిసింది.
మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వ్యతిరేకంగా పోరాడిన ఇక్కడి బిజెపి శ్రేణులు తెలంగాణకు ఆదర్శం.
మంత్రి తన కుటుంబ సభ్యులు, బంధువుల పేరిట నిర్మల్ లో భూ కబ్జాలకు పాల్పడుతున్నాడు.
*రైతుల భూములతో వ్యాపారం చేయడానికే ఈ 220 జీవో తీసుకువచ్చారు.
ఏ అధికారులు ఈ 220 జీవో ఇచ్చారో వారితోనే ఈ జీవోను రద్దు చేయించే బాధ్యత బీజేపీ ప్రభుత్వానిదే.
ఎక్కడ చూసినా ధరణి పేరుతో ఈ ప్రభుత్వం పేద రైతుల భూములను లాక్కొంది.
ముక్యంగా ధరణి పోర్టల్ రైతులకు గుదిబండగా మారింది.
ధరణిలో నష్టపోయిన రైతు ఆత్మహత్యలన్నీ… ప్రభుత్వ హత్యలే.
మజిలీస్ పార్టీ చేతిలోనే కెసిఆర్ కీలుబొమ్మ.
నిర్మల్ లో 260 ఎకరాల ప్రభుత్వ భూమిని అధికారులు ఏ హక్కుతో మంత్రి కుటుంబ సభ్యుల పేరుమీద ప్రభుత్వం అప్ప చెప్పింది.
బడా వ్యాపారుల కోసమే కేసిఆర్ ప్రభుత్వ భూములను వేలం వేస్తున్నాడు
కల్వకుంట్ల కుటుంబం రియల్ ఎస్టేట్ లకు బ్రోకర్లు గా వ్యవహరిస్తోంది.
ఎస్సీ, ఎస్టీ, బీసీ సబ్ ప్లాన్ నిధులు ఏమయ్యాయో తెలపాలి కెసిఆర్.
నిరుద్యోగులకు ఇస్తానన్న నిరుద్యోగ భృతి, ఇళ్లు లేని వారికి డబుల్ బెడ్రూం ఇళ్లు ఇలా అన్ని మోసపూరిత హామీలు ఇచ్చిన కెసిఆర్ కు వచ్చే ఎన్నికలలో ప్రజలే బుద్ధి చెప్తారు.
ఈనెల ఖమ్మం 27వ తేదీన రైతు భరోసా బిజెపి బహిరంగ సభ, ముఖ్య అతిథిగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, జేపీ నడ్డా హాజరు కానున్నారని పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి ప్రజలు భారీగా తరలి రావాలని అన్నారు.
*నిర్మల్ ప్రజలు అమర వీరులు కోమురం భీం, రాంజీ గోండు పోరాట స్పూర్తితో రాబోయే రోజుల్లో బీజేపీ జెండా ఎగుర వేయాలి.
ఈ కార్యక్రమంలో నాయకులు రావుల రాంనాథ్, అయ్యన్న గారి భూమయ్య, రమాదేవి, అల్జాపూర్ శ్రీనివాస్,రాథోడ్ రమేష్, చిట్యాల సుహాసిని రెడ్డి, మల్లికార్జున్ రెడ్డి, పల్లె గంగారెడ్డి,సామ రాజేశ్వర్ రెడ్డి, మేడిసెమ్మ రాజు, నాయుడి మురళి, వొడిసెల అర్జున్,జిల్లా , మండల బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking