చేగుంట25/09/24 ప్రాజబలం న్యూస్ :-
మెదక్ జిల్ల చేగుంట మండల విద్యాధికారిగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చేగుంట ప్రధానోపాధ్యాయురాలు టీ.నీరజ ఈరోజు చేగుంట మండల విద్యాధికారిగా బాధ్యతలు స్వీకరించారు. స్వీకరించిన సందర్భంగా అన్ని ఉపాధ్యాయ సంఘాలు అభినందనలు తెలియజేస్తూ ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తపస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నావత్ సురేష్, తపస్ మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శి చల్లా లక్ష్మణ్, టిపిటిఎఫ్ మెదక్ జిల్లా ఉపాధ్యక్షులు విఠల్ రెడ్డి ,నర్సింహా రావు,సుధాకర్ రెడ్డి,సురేందర్, తపస్ మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రావుల వెంకటేష్, రేఖ, అమరేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
