-ప్రభుత్వానికి బాధిత మహిళ పుష్పలత విజ్ఞప్తి
తప్పుడు దృవపరత్రాలతో చేసిన అక్రమ రిజిస్ట్రేషన్ ను రద్దుచేసి తనకు న్యాయం చేయాలని నల్గొండ జిల్లా సూర్యాపేటకు చెందిన పుష్పలత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. స్థల వివాదంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఎదుర్కొంటున్న వ్యక్తులు పోలీస్ శాఖలో ఎస్సైగా పనిచేస్తున్న ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన ఎస్ ఐ పేరున అక్రమంగా తన స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయించారని ఆరోపించారు.
ప్రస్తుతం సదరు ఎస్సై కి చెందిన బంధువులు తనపై దాడులకు పాల్పడుతున్నారని ఆవేదన చేశారు. ప్రభుత్వం జోక్యం చేసుకొని తనకు న్యాయం చేయాలని కోరారు.