ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..ఈరోజు నిర్మల్ గ్రామీణ పోలీస్ స్టేషన్ ఆవరణలో నూతనంగా నిర్మించిన డిఎస్పీ కార్యాలయ భవనాన్ని జిల్లా ఎస్పీ శ్రీ.చల్లా ప్రవీణ్ కుమార్. ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ గారితో అదనపు ఎస్పీ వీరన్న, అదనపు ఎస్పీ (ఏఆర్) వెంకటేశ్వర్లు, నిర్మల్ డిఎస్పీ గంగారెడ్డి, ఎస్బి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, నిర్మల్ పట్టణ/గ్రామీణ సిఐలు పురుషోత్తం చారి, శ్రీనివాస్, ఆర్ఐలు రమేష్, రాంనిరంజన్, ఎస్పీ సిసి వెంకట రమణ, ఎంటిఓ. వినోద్ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.