-రీజనల్ కమిషనర్ కి వినతిపత్రం అందించిన రిటైర్డ్ కార్మికులు
ప్రజాబలం చెన్నూరు నియోజకవర్గ రిపోర్టర్ డిసెంబర్ 20:
మందమర్రి ఏరియా సింగరేణి రిటైర్డ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సీఎం పిఎఫ్ రీజీనల్ కమిషనర్ పచౌరిని కలిసి రిటైర్డ్ కార్మిక సంఘం నాయకులు వినతి పత్రాన్ని అందించారు. శుక్రవారం మందమర్రి జిఎం కార్యాలయం కు విచ్చేసిన పచౌరీని రిటైర్డ్ కార్మికులు కలిసారు. వినతి పత్రం స్వీకరించిన అనంతరం కమిషనర్ అలీ పచౌరి మాట్లాడుతూ 10 నుండి 15 రోజులలో 11వ వేజ్ బోర్డు ప్రకారము పెన్షన్ ఇప్పించే విధంగా కృషి చేస్తానని పేర్కొన్నారు. మొత్తం 580 పెన్సిలర్లకు గాను 360కు పైగా పైల్స్ క్లియర్ చేశామని తెలిపారు. పెన్షన్ కు సంబంధించి ఎవరైనా దరఖాస్తులు చేసుకొని ఎడల ఇప్పటికైనా దరఖాస్తులు చేసుకోవాలని కోరారు. దశలవారీగా అన్ని పెన్సర్ల క్లియర్ చేసి కొత్త పెన్షన్లు పొందే విధంగా చూస్తానని పేర్కొన్నారు. అనంతరం గోదావరిఖని సీఎంపిఎఫ్ రీజినల్ కమిషనర్ పచౌరిని శాలువతో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో రిటర్మెంట్ కార్మికులు వాసాల శంకర్, కంబాల రాజనర్సు, జక్కం రాజన్న, నెల్లి వీరన్న, పోలు సంపత్, శనిగారపు రాజేష్, ఈర్లె సజ్జన్, దాసరి ఎల్లారం, గడ్డం స్వామి, ఎండి ఖలీల్, నాయిని శంకర్, ఆసమ్ కుమార్, సిహెచ్ గట్టయ్య, పీరయ్య, దూట చంద్రయ్య, వెల్ది ప్రభాకర్, ఈర్ల రాజమౌళి, ఇన్ లక్ష్మయ్య, ఆర్ హనుమంతు, కేదారి లు పాల్గొన్నారు.
