తూప్రాన్, డిసెంబర్, 16. ప్రతినిధి.
మెదక్ జిల్ల తూప్రాన్ పురపాలక సంఘ పరిధిలో 4వ వార్డు బోయ కాలనీ యందు రోడ్డు సరిగ్గా లేక తీవ్ర అసౌకర్యాలకు గురవుతున్న ప్రజల కోరిక మేరకు తూప్రాన్ మున్సిపల్ చైర్పర్సన్ మామిండ్ల జ్యోతి కృష్ణ ముదిరాజ్ జరుగుతున్న సీసీ రోడ్ పనులను పరిశీలించి నాణ్యత విషయంలో రాజీ పడకుండా రోడ్డును నిర్మించాలని కాంట్రాక్టర్ కి ఆదేశించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమ రాష్ట్ర నాయకులు కౌన్సిలర్ శ్రీశైలం గౌడ్, గారు వార్డు ప్రజలు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.